Home » Lakshman
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందువైతే భాగ్యలక్ష్మి టెంపుల్కు రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సవాల్ విసిరారు. 27 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా..? కాదా...? ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా కాదా..? ప్రమాణం చేయాలన్నారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో రేపు(బుధవారం) జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిలిపివేసింది. కళ్యాణాన్ని ఈసీ నిలిపివేయడంతో ఈ చర్యలను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వివరించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని బీజేపీ (BJP) రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ఆదివారం నాడు టేక్మాల్ మండలం పాల్వంచలో బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆలే భాస్కర్, బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.
బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపా
కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.
దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman ) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈనెల 12వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు.
Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చ్వల్గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తామంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఅర్ఎస్, కాంగ్రెస్కు అలవాటు అయ్యాయని ఆరోపించారు.