Home » Kotha Prabhakar Reddy
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమన్నారు.
సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన జరిగిన దాడిని గవర్నర్ తమిళసై ఖండించారు.
ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) అని మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి ( Kotha Prabhakar Reddy ) అన్నారు.
పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలో బీఆర్ఎస్ నుంచి అవిశ్వాసంపై నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు.
దేశంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్ల్లో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు... చెక్ చేసుకుంటారని అన్నారు. ‘‘మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారు.. నా లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కడిగిన ముత్యం లా వస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాలపై ఎంపీ స్పందిస్తూ... 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచి తనది వైట్ పేపర్ మీదనే ఉంటదని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ అని స్పష్టం చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.