Home » Konda Surekha
Telangana: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం పర్యటించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఉద్యోగంలో చేరిన స్టాఫ్ నర్స్లకు మంత్రి టోపీలు ధరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.
మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చ్వల్గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. సోమవారం నాడు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆవిష్కరించారు.
Telangana: ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారంపై మంత్రి కొండాసురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వెళ్తానని చెప్పుకొచ్చారు.
దేశ రక్షణలో భాగంగా వికారాబాద్ రాడార్ సెంటర్ నిర్మాణం జరిగిందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. దేశంలో రెండో కేంద్రంగా వికారాబాద్ ఉందన్నారు. ఇలాంటి కేంద్రాలు తమిళ్ నాడులో ఉన్నాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంచేశారు.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు.
ఏఐసీసీ అధిష్టానం సూచనల మేరకు లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) తెలిపారు. గురువారం నాడు మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశం జరిగిందని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు ( BRS Leaders ) పదవి పోయిన ప్రస్టేషన్లో ఉన్నారని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) సెటైర్లు వేశారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRDలో సీఎం రేవంత్ చర్చించారు.
జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital ) ప్రక్షాళనపై దృష్టి సారించామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఎంజీఎంలో మంత్రి సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో వసతులు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో మొన్న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.