Home » KonaSeema
మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్టు జిల్లా కన్వీనర్, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైటీఎస్ రాజు తెలిపారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించే లక్ష్యంతో మూడు విడతులుగా కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా రైతుల ఖాతాకు జమ చేయనుంది. దీనిలో భాగంగా రైతులకు మొదటి విడత నిధులు ఏప్రిల్ నుంచి జూలై వరకు అందజేయనున్నారు.
216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల భూ సేకరణకు అవార్డు పాసై భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు త్వరితగతిన నష్టపరిహారం తీసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు.
కూరగాయ ధరలు తగ్గడంతో నష్టపోకుండా రైతుబజార్లలో నేరుగా రైతులు అమ్ము కునేలా చర్యలు చేపట్టినట్టు జిల్లా మార్కెటింగ్ ఏడీ కె.రాఘవేంద్రరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఎస్పీ బింధుమాధవ్ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 98 ఆటోలను సీజ్ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్ను కాకినాడ ట్రాఫిక్- 1, 2 పోలీస్స్టేషన్ల సీఐలు ఎన్ రమేష్, డి.రామారావు ఆధ్వర్యంలో జరిగింది.
ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్ ఇన్ హౌస్ హోల్డ్స్, జియో ట్యాగింగ్, నాన్ రెసిడెన్సీ ఇన్ ఏపీ, చిల్డ్రన్స్ వితవుట్ ఆధార్, డెత్ ఆడిట్ ఇలా పలు సర్వేలను పూర్తిచేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజలో ఉండగా కాకినాడ జిల్లాలోని పె ద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు తదితర మున్సిపాల్టీలు వెనుకబడ్డాయి.
గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కోళ్లు మరణిస్తూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే మరో రెండు వేల కోళ్లు మృత్యువా త పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్క ఫారంలోనే 4,500 కోళ్లు మరణించాయి.
మహాకుంభ మేళా యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని రైతులకు నేరుగా వర్తింపచేసేందుకు కొత్తగా భూ ఆధార్-ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు ఆదివారం తెలిపారు.
హోల్సేల్గా కూరగాయల ధరలు దిగజారడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి కోత, రవాణా చార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. కూరగాయల పంటలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములు ప్రసిద్ధి. శ్రేష్ఠమైన లంక మట్టిలో ఏ రకమైన కూరగాయలు సాగు చేసినప్పటికీ మంచి దిగుబడులు వస్తాయి.