Home » Kolusu Partha Sarathy
అమరావతి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా... జగన్ సిగ్గులేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరికొన్ని సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్తో ఢీ కొట్టిన ఘటనలో మృతిచెందిన దానయ్య కుటుంబాన్ని మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.
కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ పేదల గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అడ్డంపెట్టుకొని నాని బతికిపోయారని విమర్శించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బెల్స్లా... వైసీపీ గోబెల్స్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పేర్లపై ప్రత్యేకంగా ఈ యాగం చేశారు.
ప్రతినెల ఒకటో తేదీన ఎంతో చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఒకటో తేదీన సెలవు అయితే.. 30, 31 తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.
వైసీపీ రాజకీయ పార్టీ కాదని.. హత్య రాజకీయాలకు డెన్గా తయారైందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు.