Home » Kolusu Partha Sarathy
Parthasarathy On Unseasonal Rains: అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవడంతో , పంటనష్టం జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. రేపటికి పూర్తి సమాచారం ఇవ్వమని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు.
ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలను ఓపికగా విని, సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Parthasarathi: ‘‘మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా.. లేక విలాసాలకు మూర్ఖత్వపు ఆలోచనలకు ఆ సొమ్మును ఖర్చు చేశారు. మీరు అప్పు తెచ్చిన సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేస్తున్నా. పేదవారిని నిరుపేదలుగా చేయడానికి వైసీపీ నాయకులు అందరూ కలిసి గూడుపుఠానీ చేశారు’’ అంటూ మంత్రి పార్దసారధి అన్నారు.
Kolusu Parthasarathy: పోలవరం ప్రాజెక్టును జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
CM Chandrababu: జర్నలిస్టు గోశాల ప్రసాద్ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ధైర్యంగా గళమెత్తి అన్ని వర్గాల మన్ననలు పొందారని తెలిపారు. రాజకీయ పరిణామాలపై టీవీ చర్చల్లో లోతైన విశ్లేషణతో ప్రజాపక్షాన పనిచేశారని.. తనదైన ముద్ర వేశారని అన్నారు.
Minister Gottipati Ravikumar: వైసీపీ భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
Kolusu Partha Sarathy: ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్గా సీఎం చంద్రబాబు మార్చారని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు రూ.1400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు.
ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.