Home » Kolusu Partha Sarathy
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వెల్లడించారు.
జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.
జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా? అని మంత్రి కొలుసు పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి పాలనలో తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని కొలుసు మంత్రి పార్థసారథి తెలిపారు. తమ ప్రభుత్వంలో పిల్లలను చదివించి, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఏపీకి తీరని నష్టం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
Parthasarathy On Unseasonal Rains: అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవడంతో , పంటనష్టం జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. రేపటికి పూర్తి సమాచారం ఇవ్వమని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు.
ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలను ఓపికగా విని, సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Parthasarathi: ‘‘మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా.. లేక విలాసాలకు మూర్ఖత్వపు ఆలోచనలకు ఆ సొమ్మును ఖర్చు చేశారు. మీరు అప్పు తెచ్చిన సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేస్తున్నా. పేదవారిని నిరుపేదలుగా చేయడానికి వైసీపీ నాయకులు అందరూ కలిసి గూడుపుఠానీ చేశారు’’ అంటూ మంత్రి పార్దసారధి అన్నారు.