Home » Kollu Ravindra
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వైపు ఐటీ రంగం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీనికి అనుగుణంగా మన మానవ వనరులకు తగిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతి రీజియన్లో ఏఐ సమ్మిట్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న బియ్యంతో పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి ఆరోపించారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి పేలుడు ఘటన బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.
జగన్ అవినీతి క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి విధ్వంసకారుడు, దోపీడీదారుడనే క్రెడిట్ జగన్కు మాత్రమే సొంతమన్నారు.
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
జువ్వలదిన్నె ఫిష్షింగ్ హార్బర్కు రూ.2500 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ వల్ల మత్స్యకారులకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని తెలిపారు.
వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.
తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహా పాపానికి ఒడిగట్టాడని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.