Home » Kollu Ravindra
భారతదేశంలోనే మెరైన్ ఫిషింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం నాడు మచిలీపట్నంలో కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర బృందానికి మంత్రి రవీంద్ర వివరించారు.
Andhrapradesh: మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్నినాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే... జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే .. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు.
‘ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది?
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి కష్టాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కాల్వల్లో పారెడు మట్టి కూడా తీయలేకపోయారని మండిపడ్డారు.
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సంద్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. జేపీ వెంచర్స్ రూ.842 కోట్లు ప్రభుత్వానికి బకాయి పడిందని చెప్పారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయంగా వాడుతున్నారని ఆరోపించారు.
ఆక్వా పర్యాటక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. కైకలూరుకు స్వర్గధామమైన ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ప్రజాదర్బార్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. మచిలీపట్నంలో ఈరోజు(ఆదివారం) ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ర్ట్ంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ(Sand Policy) అమలు కానుందని, దీని వల్ల రాష్ట్రంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలూ దొరుకుతాయని మంత్రి చెప్పుకొచ్చారు.