Home » Kollu Ravindra
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.
Andhrapradesh: కుటుంబానికి దూరంగా పండుగరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రజలతో ఉన్నారంటే అంతకంటే ఏముంటుందని గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే దాకా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని స్పష్టం చేశారు.
Andhrapradesh: పీ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు.
Andhrapradesh: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలు ఆందోళనను విరమించారు. కళాశాల హాస్టల్ వాష్ రూమ్ల్లో హిడెన్ కెమెరాల ఘటన కలకలం రేపింది. తమ జీవితాలను నాశనం చేశారంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఒక విద్యార్థి, విద్యార్ధినులు కలిసి కెమెరా అమర్చారని వారు ఆరోపించారు.
అచ్యుతాపురం(Achyutapuram) ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు.
Andhrapradesh: సింహాచలం అప్పన్న స్వామిని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో మంత్రి కొల్లురవీంద్ర ప్రత్యేక పూజలు చేసి.. ఆపై వేదాశీర్వచనం పొందారు.
ఫొటోగ్రఫీ రంగంలో రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫొటోగ్రాఫర్లకు రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాలు జరిగాయి.
Andhrapradesh: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో ప్రాధమికంగా 50 వేల కోట్ల దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆ రెండు శాఖల్లో దోపిడీపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అన్నారు.
అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారని అన్నారు.