Home » Kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో తమకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేశారు. ప్రజాపనుల శాఖ మంత్రి అతిషికి సర్వీసులు, విజెలెన్స్ శాఖలను అదనంగా అప్పగించారు. ఈ నియామకాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదానికి పంపారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు (Delhi Ordinance Bill) లోక్సభ (Loksabha), రాజ్యసభలో (Rajyasabha) ఆమోదం లభించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదం మాత్రమే. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆర్డినెన్స్ బిల్లు చట్టం కానుంది. త్వరలోనే ఈ బిల్లును రాష్ట్రపతికి కేంద్రం పంపనుంది. ఇంతవరకూ అంతా ఓకేగానీ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయి..?
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం వైకాపా, బీజేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 (GNTC)కు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్కు బదులుగా తీసుకొస్తున్న ఈ బిల్లుకు వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.
అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు వచ్చే వారం పార్లమెంటుకు రాబోతోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన ప్రయత్నాలు ఎంత వరకు సత్ఫలితాలిస్తాయో తేలిపోబోతోంది. ఈ బిల్లుకు మద్దతిస్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించగా, దీనిని వ్యతిరేకిస్తామని బీఆర్ఎస్ తెలిపింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్కు బదులుగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించారు.
విపక్షాల ఐక్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరు లో జరుగనున్న విపక్షాల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ హాజరవుతుందా లేదా అనే అనిశ్చితికి తెరపడింది. విపక్షాల సమావేశానికి తాము హాజరవుతున్నట్టు 'ఆప్' ఆదివారం సాయంత్రం స్పష్టం చేసింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మద్దతివ్వబోమని కాంగ్రెస్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.
ఢిల్లీ ప్రజల వరద కష్టాలు ఇంకా తీరడం లేదు. తాజాగా మళ్లీ మొదలైన వర్షాల వల్ల యమునా నదిలో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అయితే ఆదివారం రాత్రికి ఈ నదిలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.