Home » Karnataka
రాయచూరు తాలూకాలోని డొంగరాంపూర్ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది.
భోజనం చేశాం.. అయితే మాకే బిల్లు ఇస్తావా..అంటూ పోలీసులు ఓ మాజీ సైనికుడిపై విరుచుకు పడ్డారు. ధారవాడలో హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11గంటలకు సప్తపుర లే అవుట్ వివేకానంద సర్కిల్లో పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లారు.
ఇంటికి తిరిగి వచ్చిన జయమ్మ, భీమవ్వ రక్తం మడుగులో పడి ఉన్న పిల్లల్ని చూసి షాక్ అయ్యారు. ఇద్దరు పిల్లలు చనిపోవటంతో వారి గుండెలు బద్దలయ్యాయి. గుండెలు అవిసేలా వెక్కి వెక్కి ఏడ్చారు.
గత కొద్దిరోజుల నుంచి కాలేజీకి వెళ్లటం లేదు. ఇక, సతీష్ ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
కులగణన సర్వేలో పాల్గొనడం ఐచ్ఛికమేని కర్ణాటక హైకోర్టు తాజాగా పేర్కొంది. ఈ విషయం ప్రజలకు తెలిసేలా ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మీకు కారు ఉందా..? బాడుగకు ఇవ్వాలనుకుంటన్నారా? నాకు చెప్పండి. చాలా పెద్దపెద్ద కంపెనీల వారితో పరిచయం ఉంది. నేను అందులో మీ కారును బాడుగకు పెట్టిస్తాను. మీకు నెలనెలా రెంట్ ఇప్పిస్తానని కారు యజమానులను నమ్మిస్తాడు.
స్వాతి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందామంటూ సూర్య ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది.
ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభానికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. ఆమె గతంలో హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అభ్యంతరం పెట్టింది
హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా దొడ్డకాడనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. హిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆమెకు ఒక మగ శిశువు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారని హిమ్స్ ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ న్యాన్సీ పాల్ తెలిపారు.
ఆ వ్యక్తిని అందరూ ఆయిల్ కుమార్ అని పిలుస్తారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆ వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో అందరికీ షాకిస్తున్నాడు.. గత ముప్పై ఏళ్లుగా అతడు ఆహారం తీసుకోవడం లేదు.. కనీసం మంచినీళ్లు కూడా తాగడం లేదు..