Home » Kanna Lakshminarayana
ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ కే చెల్లిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జులై 20వ తేది వచ్చినా కనీసం కాలువలు మరమ్మతులు చేయలేదని.. రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారన్నారు.
టీడీపీలో చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇక నేడు మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు ఆయనకు షాక్ ఇచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు.
సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన గ్రామంలో ఇంటింటికి కోడెల, పల్లె నిద్ర కార్యక్రమాన్ని టీడీపీ నేత కోడెల శివరాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు గడ్డ మీద పసుపు జెండా చూడగానే గుర్తొచ్చే నాయకుడు కోడెల శివప్రసాదరావు అన్నారు. తనను ఒంటరి వాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలు చేస్తున్నారు.
పల్నాడు జిల్లా: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను ప్రజలకు చూపించటానికే బస్సు యాత్ర చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అరాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్ర చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర సహకార రంగాన్ని వైసీపీ ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మార్చుకుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి వైసీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు సహకార రంగంలో రూ.5వేలకోట్ల దోపిడీ జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షాకు, నాబార్డ్ ఛైర్మన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఫౌండేషన్ల పేరుతో జరుగుతున్న హడావుడి..? కోడెల శివరాం వ్యవహారం..? ఇలా అన్ని విషయాలపైనా...
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై ఉత్కంఠకు టీడీపీ తెరదించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలను అప్పగించింది. ఈ మేరకు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
తనకు సత్తెనపల్లి సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటానన్నారు. అభివృద్ధి ప్రాధాన్యమిస్తానన్నారు. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని కన్నా తేల్చి చెప్పారు. కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ వైరం లేదని.. అందరం కలిసి ముందుకు సాగుతామని కన్నా తెలిపారు.