Home » Journalist
జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు.
చిత్తూరు జిల్లా వి.కోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి జగన్ను కత్తులతో నరికి చంపేశారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఒక అమెరికన్ జర్నలిస్ట్ను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక ఇరాన్ మద్దతు ఉన్న కతాయిబ్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హస్తం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో పాత్రికేయుల నివాసాల కోసం భూమి కేటాయించేందుకు సానుకూలంగా పరిశీలిస్తామని భరోసానిచ్చారు.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతిచెందారు. గాజాలోని నాసెర్ మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు, ఖాన్యూని్సలో జరిపిన దాడిలో మరో జర్నలిస్టు మృతిచెందారు.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజాస్వామానికి నాలుగో మూలస్తంభం పాత్రికేయులను, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని నితీష్ ఈ సందర్భంగా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు.
అధికారం కోల్పోయినా వైసీపీ మార్క్ దాడుల సంస్కృతి ఆగలేదు.