Home » JDU
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై(Nitish Kumar Resign) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్ని ఉద్దేశించి అన్నారు.
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తుండగా, నితీష్ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం హస్తినలో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై ఆర్జేడీ సైతం వరుస సమావేశాలు జరుపుతోంది.
బీహార్లో నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నిట్టనిలువుగా చీలనుందా? జేడీయూ, ఆర్జేడీ మధ్య తలెత్తిన లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయా? కమలనాథులతో తిరిగి నితీష్ జేడీయూ పొత్తు పెట్టుకుని అధికారం కొనసాగించనుందా? అవుననే స్పష్టమైన కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.
విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
బిహార్లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.
విపక్ష కూటమిలో అసంతృప్తులను శాంతపరచడం ద్వారా రాహుల్ గాంధీ చేపట్టనున్న ''భారత్ న్యాయ్ యాత్ర'' కు లైన్ క్లియర్ చేసేందుకు ''ఇండియా'' కూటమి కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి కోఆర్డినేటర్ గా నియమించే అవకాశం ఉంది.
జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
జనతాదళ్ యునైటెడ్ అధ్యక్ష పగ్గాలను తిరిగి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన చేతుల్లోకి తీసుకున్నారు. బీహార్ అధికార జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ శుక్రవారంనాడిక్కడ జరిగిన పార్టీ జాతీయ ఎక్సిక్యూటివ్ సమాశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు.
బీహార్లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఇండియా బ్లాక్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను ప్రధాని అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించడంపై జేడీయూ గుర్రమంటోంది. తాజాగా జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ నిప్పులు చెరిగారు. ''అసలు ఖర్గే ఎవరు? ఆయన గురించి ఎవరికీ తెలియదు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పీఎం అభ్యర్థి కావాలి'' ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.