Home » Janasena
వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైఎస్ జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలవల్లే వైసీపీని వీడానని బాలినేని తెలిపారు. అంతేకాదు.. తనలాంటి సీనియర్లను జగన్ అస్సలు పట్టించుకునేవారని ఆరోపించారు.
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
Andhrapradesh: ఎర్రమట్టి దిబ్బల వద్ద జరుగుతున్న పనులు వెంటనే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎర్ర మట్టి దిబ్బలు తవ్వకాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ ఇందుకు సంబంధించిన పిల్ దాఖలు చేశారు.
కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ) ఫొరెన్సిక్ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, రాయలేని బూతు పదాలు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దిగివచ్చారు. క్షమాపణలు కోరారు.
అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాకే ఇచ్చారు. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్బై చెప్పారు.
నిన్న (బుధవారం) వైసీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ పొలిటీషియన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇవాళ (గురువారం) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ కానున్నారు. జనసేనలో చేరికపై కీలక మంతనాలు జరపనున్నారు. అయితే జనసేనలో చేరేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఒకవేళ అనుమతి ఇస్తే ఆయన చేరిక ఎప్పుడు?
అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరి లోనే సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.
జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్స్ డేగా ఇవాళ జరుపుకుంటున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. దేశ అభివృద్ధికి సూచికలైన ఇంజినీర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు.
Andhrapradesh: అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎంతటి అహంకారాన్ని చూపించారు... ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. అధికార పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేయాలని శతవిధాలుగా యత్నిస్తూనే ఉన్నారు.