Home » Jammu and Kashmir
Pahalgam Terror Attack: ఉగ్రదాడి గురించి తెలియని చాలా మంది ఎంతో ప్రశాంతంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మరికొంతమంది షాపుల దగ్గర నిల్చుని ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి పోయిన వారు ఎందుకలా చేశారో కూడా వారికి అర్థంకాలేదు.
భారత్ - పాక్ దేశాల మధ్య నియంత్రణ రేఖ ముళ్ల తీగల కంచెలకు ఆవల ఉగ్రవాద లాంచ్ప్యాడ్లు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇది పాకిస్తాన్ దళాల ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలోని ప్రాంతం.
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు సూచనలు వస్తున్నాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తన ప్రవర్తనను ఇంకా అలాగే కొనసాగిస్తోంది. వరుసగా తొమ్మిదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, మే 3న జమ్మూ కశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి మరోసారి మిలిటరీ ఆగ్రహాన్ని చూపించింది.
Pahalgam Terror Attack: పర్యాటకుల ప్రాణాలు రక్షించడానికి ధైర్య సాహసాలు ప్రదర్శించిన మృతుడు సయ్యద్ ఆదిల్కు ‘ బ్రేవరీ అవార్డు’ను ప్రకటించారు. ఈ అవార్డును వారి కుటుంబసభ్యులకు అందించారు. ఆదిల్ సోదరుడు సయ్యద్ నాజకత్ హుస్సేన్కు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది.
JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ ఆఫీజ్ సయ్యద్కు నాలుగు రెట్లు భద్రత కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశం దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
పహల్గాం దాడికి రెండు రోజుల ముందు నుంచే బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఉగ్రవాదులు వేరే మూడు చోట్ల మారణకాండ సృష్టించాలని నిర్ణయించుకున్నారు.