Home » jairam ramesh
కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన 'జాతి వివక్ష' వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి.ఈ నేపథ్యంలో పార్టీకి, పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారంనాడు వివరణ ఇచ్చారు.
అమేథీ నుంచి రాయబరేలికి రాహుల్ గాంధీ పారిపోయారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ కొట్టివేసింది. చెస్, రాజకీయాల్లో నిష్ణాతుడైన ఆటగాడుగా రాయబేరిలి నుంచి పోటీ చేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ ఇన్చార్జ్ జైరామ్ రమేష్ చెప్పారు.
మేథీ, రాయబరేలి లోక్సభ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులపై కొన్ని గంటల్లో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా సెల్ చీఫ్ జై రాం రమేశ్ బుధవారం వెల్లడించారు. ఆ యా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కసరత్తు చేస్తున్నారన్నారు. 24 గంటల్లో లేదా 30 గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు కౌంటర్గా.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బంగ్లాదేశ్ భూ ఒప్పందాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తలచింది ఒకటైతే.. జరుగుతోంది మరొకటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) పేర్కొన్నారు. ఆయన ‘కాంగ్రెస్-ముక్త్ భారత్’ని (Congress-mukt Bharat) కోరుకున్నారని, కానీ అందుకు బదులుగా ‘అవినీతి-ముక్త్ కాంగ్రెస్’ (Corrupt-mukt Congress) చేస్తున్నారని సెటైర్లు వేశారు.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా 42 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ''ఎక్స్'' వేదికగా అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ (Jairam Ramesh) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ అంశం నుంచి కాంగ్రెస్ పారిపోవడం లేదని, క్రాస్ ఓటింగ్ జరిగింది నిజమేనని అన్నారు. అయితే.. ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు.
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు సుల్తాన్పూర్ జిల్లా సివిల్ కోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
'ఇండియా' కూటమి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఉద్దేశించినది మాత్రమేనని, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. 27 పార్టీలతో ఏర్పడిన 'ఇండియా' కూటమి పూర్తి మనుగడలో ఉందని, కలిసికట్టుగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కావడంతోనే అసోం సీఎం భయపడి దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసోంలోని సునీత్పూర్ జిల్లా జుముగురిహాట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కారుపై పలువురు వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ అంటోంది.