Home » Jagtial
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తూ మున్సిపాలిటీల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కా పద్దులు, బ్యాంకు రుణాలు ఇప్పించే బాధ్యతలు చూసే ఆర్పీ (రిసోర్స్ పర్సన్)లకు వేతన వెతలు తప్పడం లేదు. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శాతవాహన యూనివర్సిటీలో అవినీతి బాగోతం కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులే సూత్రధారులుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. యూనివర్సిటీ పరిపాలన విభాగం నిర్వహించే భవనం మొదటి అంతస్తు నిర్మాణం కోసం ఏడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
పట్టణ మహిళా పేదరిక నిర్మూలనకు పాటు పడాల్సిన మెప్మా సిబ్బంది అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అందిన కాడికి మేస్తున్నారు. వారి అక్రమాలకు రాజకీయ పలుకుబడి కూడా అనుకూలించడంతో వారి అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి తిరిగి అధికారంవైపునకు అడుగులు వేయాలని బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు తోడుగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మల్చుకొని జిల్లా పరిషత్లు, మండల పరిషత్లను, పంచాయతీలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహం రూపొందిస్తున్నది.
పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, డుమ్మాలకు చెక్ పెట్టేందుకు పంచాయతీరాజ్శాఖ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చింది. సుమారు రెండు నెలలుగా జిల్లాలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కొనసాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సగానికిపైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను, పంచాయతీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రూపొందిస్తున్నది. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్థానాలపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరాగా నిలవడానికి మరోమారు వాహనాలు, పరికరాలు పంపిణీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలకు రూ.4,016 పింఛన్, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరింత బాసటగా నిలువడానికి ప్రయత్నం చేస్తోంది.
జిల్లాలో వానాకాలం సాగు జోరందుకుంది. మూడు రోజులుగా ముసురు వానలతో వాడిపోతున్న పత్తి, మొక్కజొన్న మెట్ట పంటలు ఊపిరి పోసుకున్నాయి. దీంతో రైతులు హుషారుగా పొలం పనుల్లో బిజీగా మారిపోయారు.
బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
క్షయ రహిత జిల్లాగా జగిత్యాలను తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాకు స్ర్కీనింగ్ చేసి ముందస్తుగా గుర్తిస్తున్నారు.