Home » Jagan
జగనన్న ఇళ్ల స్థలాల చదును పనుల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేలా మొక్కుబడి తనిఖీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు, పరీక్షలు, సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాలను అవమానిస్తున్నాయి. రీయింబర్స్మెంట్ ఆలస్యం పేరిట విద్యార్థులపై ఒత్తిడి తేవడమే కాకుండా ఫైన్లు వసూలు చేస్తున్నాయి.
మోనికా బేడీ నకిలీ పాస్పోర్టు వివాదంలో రెవెన్యూ అధికారి కృష్ణమోహన్, జెత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇద్దరూ బెజవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదించింది. రూ.3500 కోట్ల దుర్వినియోగంపై విచారణ అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. కాంపిటెంట్ అథారిటీ అనుమతి అవసరం లేదని ఏడీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ, జైలులో సౌకర్యాలు కల్పించాలన్న నిందితుల విజ్ఞప్తికి అంగీకరించింది.
మద్యం కుంభకోణంలో అరెస్టైన గోవిందప్ప బాలాజీ జైలులో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అదే కేసులో సజ్జల శ్రీధర్రెడ్డి, దిలీప్లను సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు.
YCP: శాసన మండలిలో వైసీపీకి మరో వికెట్ డౌన్ అయింది. మండలి డిప్యూటీ చైర్మెన్గా ఉన్న జకియా ఖానమ్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది. తర్వాత ఆమె ఏ పార్టీలో చేరతారంటే..
వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ, తన అధికారంలోకి వస్తే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులను ఎక్కడైనా పిలిపించి శిక్షిస్తానని అన్నారు. అలాగే, జెడ్ ప్లస్ భద్రత పొందేందుకు హైకోర్టులో పిటిషన్ వేశారు
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి పార్టీ నాయకులతో సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది ప్లీనరీని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడి, కేసులపై భయపడకూడదని పేర్కొన్నారు
వైసీపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు అయిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్పలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించి, కేసులో సమగ్ర దర్యాప్తు కోసం కస్టడీలో విచారణ చేయాలని ఆదేశించింది
మద్యం స్కాంలో ప్రధాన నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్పల ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు తిరస్కరించింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొంటూ కస్టడీలో విచారణకు వీలుగా తీర్పునిచ్చింది.