Home » Israel
పశ్చిమాసియాలో అమెరికా వేల సంఖ్యలో పారాట్రూపర్లను మోహరించింది. వ్యూహాత్మక ప్రాంతాలకు వీరిని తరలించింది. మిత్రదేశాలకు రక్షణ, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే దీని లక్ష్యమని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇరాన్లోని కీలకమైన ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడులు ఆ దేశ అణు కార్యక్రమాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ దాడిలో ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నదని, అది ఇక ఏమాత్రం పనిచేసే స్థితిలో లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది.
పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా వైమానిక, నౌకాదళాలు దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం 'ఖార్గ్ ఐలాండ్'ను అమెరికా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
బహ్రెయిన్ అల్యూమినియం ప్లాంట్పై డ్రోన్ దాడి తామే చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు సహకరిస్తోందనే ఈ దాడులు చేశామని తెలిపింది.
మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యంగా ఉన్నాయని అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్ శాస్త్రీయ పునాదులను, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్లోని అణు కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చాయి. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇజ్రాయెల్ మీద ఇరాన్ విరుచుకుపడింది. కీలకమైన హైఫా పోర్ట్పై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడి చేసింది. నౌకాదళ మరమ్మత్తు కేంద్రాలు, లాజిస్టిక్స్ విభాగాలు, భారీ ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ డ్రోన్ సామర్థ్యం తగ్గిందన్న అమెరికా-ఇజ్రాయెల్ వాదనలకు ఈ దాడి సమాధానమని ఇరాన్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ అత్యున్నత పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చేతిలో హతమవుతామనే భయమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఇరాన్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఒక విచిత్రమైన భయం నెలకొందన్నారు.
శత్రుదేశాల నౌకల్ని మాత్రమే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లనివ్వమని, మిత్రదేశాలకు, సాధారణ వాణిజ్యానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే జలసంధిని మూసివేసే హక్కు ఇరాన్కు ఉందని ఆదేశ విదేశాంగ మంత్రి అరాగ్చీ చెప్పారు.