Home » India vs Australia
Tilak Varma: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లీస్ ఈ సారి సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు.
India vs Pakistan: ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అదరగొట్టిన భారత జట్టు ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 2-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.
IND vs AUS 2nd T20: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
Rohit sharma-KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు.
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు (ఆదివారం) ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలవగా..
IND Vs AUS: విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు వీరవిహారం చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
IND Vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 విశాఖ వేదికగా ఈరోజు రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు తొలి టీ20 గెలవాలని ఆకాంక్షిస్తూ మ్యాచ్ ప్రారంభానికి ముందు సింహాచలంలోని అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం స్వామి వారి సన్నిధిలోని వచ్చిన టీమిండియా క్రికెటర్లకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.
Suryakumar yadav Comments: గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. చాలా రోజలు తర్వాత విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుండడం గమనార్హం. ఈ సిరీస్లో టీమిండియాకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు.
ఓవైపు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం చవిచూసినందుకు టీమిండియాతో పాటు క్రీడాభిమానులు బాధపడుతుంటే.. మరోవైపు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఓటమిని తమ పొలిటికల్ మైలేజ్ కోసం వినియోగించుకుంటున్నారు.
India vs Australia: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిందనే బాధ నుంచి అభిమానులు ఇంకా కోలుకోనే లేదు. ఇంతలోనే టీమిండియా మరో సిరీస్కు సిద్ధమైపోయింది. అది కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన నాలుగో రోజుల్లోనే కావడం గమనార్హం. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.