Home » Governor of Tamil Nadu
ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమిళనాడులో కొనసాగుతున్న ప్రతిష్టంభనను 'కృత్రిమ సంక్షోభం'గా సీనియర్ అడ్వకేట్, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా టీవీకే చీఫ్ విజయ్ను గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు.
టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం.. ఆత్మహత్యల రాజధానిగా మారుతోంది.. అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే గవర్నర్ కు, అధికార డీఎంకే పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. మళ్లీ.. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై వివాదం ఎంతవరకు వస్తుందోననే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ ఆర్.ఎన్.రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీశాయి..
దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్ ఆర్ఎన్ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన మంత్రి మోదీ దీర్ఘకాల దృష్టి అన్నారు.
నాలుగేళ్లుగా గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు.
ప్రజాధనం దోచుకుంటున్న డీఎంకేను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతోనే రాష్ట్ర గవర్నర్ను ఆ పార్టీ శత్రువుగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు.
నగరంలో అద్దె ఆటో డ్రైవర్గా చాలీచాలని సంపాదనతో ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్న అమల అనే మహిళకు గవర్నర్ ఆర్ఎన్ రవి కొత్త ఆటోను కానుకగా అందజేసి ఆమెకు విస్మయం కలిగించారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాని, గవర్నర్ కార్యాలయమైన రాజ్భవన్ల మధ్య మళ్ళీ అగాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికా కొరకురాని కొయ్యగా మారిన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తాజాగా విడుదల చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఆ ప్రకటన సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం తీవ్రంగా విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో మూడుసార్లు ‘జై శ్రీరామ్’ అని పలికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు