Home » Godavari-Kaveri Rivers
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పేరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. రెండు నదులపై ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
గోదావరి-కావేరీ నదుల అనుసంధానం అంశంలో మళ్లీ కదలిక వచ్చింది. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై వచ్చేనెల 24వ తేదీ ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్లోని ఎర్రమంజిల్లోని జల సౌధలో సమావేశం జరుగనున్నది.
గోదావరి-కావేరీ అనుసంధానం తొలి దశ కింద తరలించే నీటిలో 50 శాతాన్ని(74 టీఎంసీలను) కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎ్సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ జలశయాలన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద కొనసాగుతుండడంతో గురువారం నాగార్జునసాగర్ జలాశయం అన్ని గేట్లూ తెరుచుకున్నాయి.
గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.50 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 5,81,417 క్యూసెక్కులు ప్రవాహం వెళుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పాండ్ లెవల్ 13.26 మీటర్లుగా ఉంది.
నదుల అనుసంధాన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఈ సంధానం రాష్ట్రానికి మేలు చేసేలా...