Home » God
మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అశోక్నగర్లోని రమాసమేత సత్యనారాయణస్వామి దేవాలయం, మూడోరోడ్డు షిర్డీ సాయిబాబా ఆలయం, మల్లేశ్వరరోడ్డులోని లక్ష్మీ గణపతి మందిరాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు.
కోరిన కొర్కెలు తీర్చే కొండమీద రాయుడు స్వామి హనుమద్వాహ నంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదో రోజు హనుమద్వాహ న సేవ ఆదివారం నేత్ర ప ర్వంగా సాగింది. ఉద యం స్థానిక అంజినేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తుల కు వేద పండితులు ప్ర త్యేక పూజలు నిర్వహిం చారు.
స్థానిక కొండమీద రాయు డు స్వామి బ్రహోత్సవా లు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ్ఞఅందులో భాగంగా నా లుగో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు శేష వాహ నంపై భక్తులకు దర్శనమి చ్చారు.
విష్ణు సహస్ర నామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు.
కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు.
కార్తీకమాసం ఆరుద్ర నక్ష త్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శారదానగర్లోని శివబాల యోగి ఆశ్రమంలో కోటి దీపో త్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం అనంతేశ్వరస్వామికి భక్తుల చేతులమీదుగా అన్నాభిషేకం చేశారు.
భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబిం బాలు ఆలయాలు అని అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీ అద్వైతానంద భారతి అన్నారు. శారదానగర్లోని శృంగేరి శంకరమఠం, మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం, పాతూరులోని దత్తమందిరాలను మంగళవారం ఆయన సందర్శించారు.
మండలపరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తు లు స్వామివారి దర్శనం కోసం తరలివ చ్చారు.
మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.రెండు లక్షలకు పైగా విలువైన బంగారం పులిగోరు హారాన్ని భక్తు లు మంగళవారం సమర్పించారు.
లోకరక్షణకోసం శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని చిటికినవేలితో ఎత్తిన పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నగర శివా రులోని ఇస్కాన మంది రంలో గోవర్ధనరిపూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నకూటమితో గోవర్ధనిగిరిని ఏర్పాటుచేసి, రకరకాల పండ్లు, కూరగాయలతో గిరిని అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు.