Home » GHMC
మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది..
జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో 11 వేల 460 కోట్ల రూపాయల మెగా బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటిదొంగలు ఎక్కువయ్యారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన కొంతమంతి అధికారులు వాటిని ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఓ వ్యవహారం అధికారుల పనితీరును ప్రశ్నించేలా చేస్తోంది.
నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలను రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. మరో కోట్లాది రూపాయల విలువ చేసే పభుత్వ భూమిని కాపాడగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో.. డివిజన్ల రిజర్వేషన్లపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు కాలనీల్లో పర్యటిస్తున్నారు.
సింగూరు ప్రాజెక్ట్ మెయిన్ పైప్లైన్లో ఏర్పడిన లీకేజీల కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అత్యవసర మరమ్మతులు చేపట్టడంతో సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రజలు నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ బోర్డు అధికారులు కోరారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.
రాజేంద్రనగర్ను హైదరాబాద్లో కలపొద్దు.., శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విభజించి తీసుకొస్తున్న కార్పొరేషన్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.