Home » Gas cylinder
దేశ వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్ కు రావాల్సిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో, గ్యాస్ ఏజెన్సీల ముందు సామాన్యులు గంటల తరబడి క్యూ కడుతున్నారు.
ఎల్పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, 'ప్యానిక్ బుకింగ్' అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది.
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ప్రభావం పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొన్ని కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లను విడుదల చేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచంలో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
గ్యాస్ కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. జనం వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్లలో ఇండక్షన్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీని ప్రభావం ఆయిల్, గ్యాస్ రంగాలపై పడింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.