Home » EVM Machine
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఒక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
కన్నియాకుమారి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 9 మంది ఓటర్లుండగా, ఎన్నికల అధికారులు సుమారు 150 కి.మీ పయనించాల్సిన పరిస్థితులన్నాయి.
సర్వేలో భాగంగా 1023 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5,100 మంది అభిప్రాయాలను కేఎంఈఏ సేకరించింది. ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్టు సర్వే పేర్కొంది.
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతోపాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు.
ఈవీఎంలపై లేవనెత్తుతున్న ప్రశ్నలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈవీఎంలకు హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించి చూపించాలని ఆ పార్టీ ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.
హర్యానా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల వినియోగంపై మరింత దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.
మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి తాను పోరాడుతున్నానని తెలిపారు.
బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచినట్టు తేలిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని, ఎన్నికల అవకతవకలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానం రూపొందించాలని కేఏ పాల్ కోర్టుకు తాన వాదన వినిపించారు.