Home » Election Commission
ఆధార్ను విలువైన ఐడెంటిటీ ప్రూఫ్గా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే. ఆధార్ ప్రామాణికత, వాస్తవికతను పరీక్షించే అధికారం అధికారులకే అప్పగిస్తున్నామని తెలిపింది.
ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్లు ఇచ్చేటప్పుడే దరఖాస్తు ఫారంపై కొత్తగా తీయించుకున్న ఫోటోను జత చేయాలని అధికారులు కోరారు. రికార్డులు అప్డేట్ చేసేటప్పుడు కొత్త ఫోటోలను జత చేసి కొత్త ఓటరు కార్డులు జారీ చేస్తారని ఈసీ వర్గాల పేర్కొన్నాయి.
ఓట్ల చోరీ ఆరోపణలపై తామడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని రాహుల్ అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా లేదని, ఈసీఐ, ఎన్నికల కమిషనర్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
బిహార్లో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమం(ఎ్సఐఆర్)లో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లను ఎక్కువగా తొలగించినట్లు తేలింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశమయ్యారు.
డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెప్పారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిసీటీవీ ఫుటేజ్ను షేర్ చేయకపోవడానికి ఓటర్ల ప్రైవేసీని కాపాడాలన్నదే కారణమని సీఈసీ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ను ఎన్నికల కమిషన్ షేర్ చేయకపోవడంపై రాహుల్ గాంధీ సారథ్యంలోని పలు వివక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు.
బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్కు వ్యతిరేకంగా 'ఓటర్ అధికార్ యాత్ర'ను రాహల్ గాంధీ ప్రకటించారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని ప్రజలను ఆయన కోరారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్ గడ్డపై నుంచే ఆగస్టు 17 నుంచి 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.