• Home » Election Commission

Election Commission

ఫాల్తాలో రీపోలింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఫాల్తాలో రీపోలింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్‌లలోనూ అక్రమాలు జరిగినట్లు ఈసీ గుర్తించింది. ఆ పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. మే 21వ తేదీన రీపోలింగ్ జరగనుంది. మే 24వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..

బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్‌ హార్బర్‌ నుంచి 29 ఫిర్యాదులు.. మగ్రహట్‌ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి.

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

భవానీపూర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సౌత్ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు వెళ్లడం, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తలెత్తిన హైడ్రామాపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ టీఎంసీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.

బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

పశ్చిమబెంగాల్‌‌లో రెండో విడత పోలింగ్‌ స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ కీలక నియామకం జరిపింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు

పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఖర్గేకు నోటీసు పంపింది.

ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపే ప్రతినిధి బృందం ఫిర్యాదు

ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపే ప్రతినిధి బృందం ఫిర్యాదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌‌ను కలిసింది. ఖర్గే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు, పగలు పిలియన్ రైడింగ్‌పై నిషేధం: ఈసీ

రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు, పగలు పిలియన్ రైడింగ్‌పై నిషేధం: ఈసీ

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు వీలుగా బైక్ ర్యాలీలపై నిషేధం, పిలియన్ రైడింగ్స్‌పై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకానికి ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన.. ఉభయసభల్లో తీర్మానం నోటీసు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన.. ఉభయసభల్లో తీర్మానం నోటీసు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ (CEC Gyanesh Kumar)ను తొలగించాలంటూ 'ఇండియా' కూటమి పార్టీలు తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యాయాధికారులను అనుమానిస్తే సహించేది లేదు: సుప్రీంకోర్టు

ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యాయాధికారులను అనుమానిస్తే సహించేది లేదు: సుప్రీంకోర్టు

పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి