Home » Election Commission
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఖర్గేకు నోటీసు పంపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కలిసింది. ఖర్గే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు వీలుగా బైక్ ర్యాలీలపై నిషేధం, పిలియన్ రైడింగ్స్పై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకానికి ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)ను తొలగించాలంటూ 'ఇండియా' కూటమి పార్టీలు తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు.
పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరునూ తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. పశ్చిమబెంగాల్లో స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో లెక్కకు మిక్కిలిగా ఓటర్లను తొలగిస్తున్నారని, అధికార పక్షానికి అనూకూలంగా వ్యవహారిస్తూ, పారదర్శకతను పాతరేస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై విరుచుకుపడుతున్న విపక్షాలు తాజాగా ఆయనపై అభిశంసన అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు కోల్కతాలో నిరసనల సెగ తగిలింది. ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని సోమవారం ఉదయం దర్శించేందుకు వచ్చిన ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 28వ తేదీనాటికి మొత్తం 7.04 కోట్ల మంది ఎన్నికల జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపింది.