Home » Election Commission
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాలాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ చర్యను సూపర్ ఎమర్జెన్సీతో ఆమె పోల్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వివిధ పోలింగు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.
పౌరసత్వ వెరిఫికేషన్తో పాటు డూప్లికేట్లను, చనిపోయిన వారిని, చిరునామా మార్చుకున్న ఓటర్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ను రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ఈసీ ప్రశ్నించింది.
ఏడు కోట్ల మంది పేర్లతో ఓటర్ల జాబితాను అప్డేట్ చేశామని, ఒక్క నకీలీ ఓటును చేర్చడం కానీ, అర్హులను తొలగించడం కానీ జరగలేదని సీఈసీ చెప్పారు. ఎన్నికల యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, భద్రతా సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఉపఎన్నికలు జరుగనున్న వార్డుల్లో ముండ్కా, షాలిమార్ మార్గ్-బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, ద్వారకా-బి, డిచావు కలాన్, నారాయణ, సంగమ్ వివార్-ఎ, దక్షిణ్ పూరి, గ్రేటర్ కైలాష్, వినోద్ నగర్ ఉన్నాయి.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకోరాదు. అలా చేసినట్లయితే సెక్షన్ 31 కింద ఏడాది జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
నామినేషన్ వేసిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థులు ఇతర వ్యక్తులు, సంస్థలకు రూ.10 వేలకు మించి నగదు లావాదేవీలు జరపవద్దని, చెక్కుల రూపంలో డబ్బుల బదిలీ ఉండాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్కుమార్లాల్, సహాయ వ్యయ పరిశీలకులు రామకృష్ణ సూచించారు.
ఎన్నికల జాబితా క్వాలిటీపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు లెవనెత్తుతున్నందున ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం అవసరమైందని సీఈసీ చెప్పారు. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు ఎస్ఐఆర్ నిర్వహించామని, చివరిసారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టామని చెప్పారు.