Home » Education
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైమ్ టైబుల్ వచ్చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం నాడు ఇంటర్ ఇగ్జామ్స్కి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చ్ 24వ తేదీ వరకు ..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలను జేఎన్టీయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ కళాశాలైన జేఎన్టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.
జేఎన్టీయూలో పనిచేస్తున్న ఆచార్యుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద అర్హులైన ఆచార్యులకు పదోన్నతుల ప్రక్రియను జేఎన్టీయూ చేపట్టింది. దీంతో ఆచార్యుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్తో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం తన చాంబర్లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షల పైచిలుకని విదేశాంగ శాఖ తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే, విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే తగ్గింది.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
పిల్లలు, తల్లిదండ్రుల త్యాగాలను మరవకూడదని సూచించారు. తల్లి ప్రేమ, తండ్రి త్యాగం ఎంతో గొప్పదని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తల్లికి చెప్పలేని ఏ పని కూడా చేయకూడదని సూచించారు.
తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.