Home » Education
ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 17, 2025 దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ .
టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.
ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు దాఖలు గడువును ఐబీపీఎస్ పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 28లోపు సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను భూస్థాపితం చేసింది భారత సైన్యం. వారి వీరోచిత పోరాటాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు NCERTఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేస్తోంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్మన్) 3,588 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 26 నుండి ఆగస్టు 24, 2025 మధ్య ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పట్టుదల, సృజనాత్మకతతో ముందుకు సాగాలంటూ తిరుపతి ఐఐటీ విద్యార్థులకు క్రియా యూనివర్సిటీ చాన్సలర్ లక్ష్మీనారాయణన్ సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఒక సువర్ణావకాశం వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 19, 2025 నుంచి 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం..
జిల్లాలో 1,342 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1,40,171 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్తోపాటు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు.
జేఎన్టీయూ వన్టైమ్ చాన్స్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ర్యాంకులు పొందిన విద్యార్థులకు సీట్ల కేటాయింపులో అధికారులు ఎడతెగని జాప్యం చేస్తున్నారు.