Home » Education News
ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.
ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.
Bank of America Internship 2025: డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2025 సంవత్సరానికి గాను ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత కోర్సు ద్వారా అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది.
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ కౌన్సెలింగ్ మూడోవిడత ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ప్రకటించింది.
ECIL Recruitment 2025: మీరు ITI పాస్ అయి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఇదే సువర్ణావకాశం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సీనియర్ ఆర్టిసాన్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 7 లోపు www.ecil.co.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.23,368 నుండి ప్రారంభమవుతుంది. ఐటీఐ, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కాలేజీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎప్సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
విద్యా హక్కు చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు సీట్లు ఎందుకివ్వాలని అడ్డం తిరుగుతున్నాయి.