Home » East Godavari
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): రేషన్కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై నెలంతా రేషన్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి ప్రక టించారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో 17 ల
కొబ్బరి పేరు చెప్పగానే మనందరకీ గుర్తొచ్చేది కోనసీమ. ఎటుచూసినా పైరు పచ్చని వరి చేలు.. కల్పవృక్షాల్లాంటి కొబ్బరిచెట్లు.. వాటికి నలుదిక్కులా గెలలతో కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. కోనసీమ రైతుల బతుకు బండి కొబ్బరి పంటపైనే ఆధారపడి ఉంది.
ఉభయ గోదావరి జిల్లా ఆరోగ్య ప్రధాయిని అయిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)కు ప్రతిరోజు వైద్యం నిమిత్తం సుమారు 4 వేల మంది వస్తుంటారు. వారిలో సుమారు 200 మంది మహిళలు ప్రసూతి వైద్యం నిమిత్తం వస్తుంటారు.
ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడితో పెళ్లి కోసం హిజ్రాగా మారాల నుకున్నాడో వ్యక్తి. అయితే ఆపరేషన్కు రూ.5 లక్షలు ఖర్చువుతుండడంతో దొంగతనానికి ప్లాన్ చేశాడు. పక్క ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. ఆ ఇంట్లో వృద్ధురాలిపై ప్రియుడితో కలిసి దాడి చేసి బంగారం లాక్కుని పరారై చివరికి పోలీసులకు చిక్కారు.
ONGC గ్యాస్ లీక్ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తరుచుగా ఈ గ్యాస్ లీకేజీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘స్త్రీశక్తి పథకం’ అమలుకు తుదికసరత్తు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్ల పాలసీ అమలుకు గ్రీన్సిగ్నల్ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గత వైసీపీ హయాంలో కొత్త కార్డుల జారీ లేక పోవడంతో వేలాది మంది పేదలు ఈసురోమ న్నారు. రకరకాల కారణాలతో ఉన్న కార్డులను సైతం భారీగా అప్పట్లో ఏరేశారు. దీంతో ప్రభు త్వం మారాక కార్డుల జారీకి నిర్ణయించడంతో ఇప్పటి వరకు 1.53 లక్షల మంది అర్జీలు అం దించారు. ఇందులో ఏకంగా 1.10 లక్షల మంది తమకు ఉన్న కార్డుల్లో అదనపు సభ్యులను చేర్చా