Home » Dog
దేశంలో కొంత కాలంగా పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు సంఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కుక్కలు బైకులు, కార్ల వెంట పరుగెత్తడం అనేది చాలా సాధారణ విషయం. ముఖ్యంగా వీధి కుక్కలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వాటి సహజ స్వభావం, భయం, పరిసరాల ప్రభావం వంటి అనేక కారణాలు ఉంటాయి.
ఆ రెండు రకాల కుక్కల్ని పెంచవద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పేర్కొంది. చూపరులకు భయం కలిగేలా మొరిగే పిట్బుల్, రాట్వీలర్ శునకాలను పెంచవద్దని జీసీసీ తెలిపింది. ఈ మేరకు అంతే కాకుండా ఈ రెండు రకాలకు చెందిన శునకాలను పెంచితే రూ.లక్ష చొప్పున జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
నగరంలో.. వీధికుక్కల బెడద ఎక్కువైంది. నిత్యం ఎక్కడో ఓచోట, ఎవరో ఒకరు కుక్కకాటుకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఏరియాలో వృద్ధురాలిని కుక్క దాడి చేసి గాయపరిచింది. భీమవరం నుంచి బంధువుల ఇంటికి వచ్చిన ఆమెను కుక్కలు దాడి చేశాయి.
అనంత నగరంలో వీధికుక్కలు 10 వేలకుపైగా ఉన్నాయంటే నమ్మడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏ వీధికెళ్లినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి.
నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.
పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారుల్లో కదలిక వచ్చింది.
వీధికుక్కలతో అక్కడి ప్రజలు భయపడాల్సి వస్తోంది. ఏదైనా పనిమీద బయటకు వెళితే.. తిరిగి ఇంటికి జాగ్రత్తగా వస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా వీధికుక్కలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం మూడు నెలల్లోనే 106 కేసుల నమోదయ్యాయంటే ఇక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
పెంపుడు జంతువులను పార్లమెంటుకు తీసుకురావడం ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని బీజేపీ ఎంపీ జగదాంబికాపాల్ అన్నారు.