Home » DK Shivakumar
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తల పెట్టిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖా మంత్రి, డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. కూడ్లిగిలో చెరువులకు నీరు వదిలే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయంలో నీరున్నా కాలవలకు వదలడం సాధ్యం కాదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్ల క్యారికేచర్లతో కృత్రిమ మేథస్సును ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో 26 సెకన్ల పాటు ఉంది. ఇందులో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కలిసి డీకే శివకుమార్కు 'హాయ్' అంటూ వాట్సాప్ మెసేజ్ పంపుతారు.
బెంగళూరుతో సహా రాష్ట్రంలోని పలు చోట్ల పెద్దసంఖ్యలో బిహారీలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి ఆయా సంస్థల యజమానులు కనీసం మూడు రోజుల పాటు పెయిడ్ హాలిడే ఇవ్వాలని డీకే శివకుమార్ కోరారు.
సీఎంతో మునుపటిలాగానే చక్కటి సమన్వయం కొనసాగుతోందని, అందరూ ఐక్యంతో ఉండటం వల్లే 136 నియోజకవర్గాల్లో గెలిచి 140కి బలం పెరిగిందని డీకే శివకుమార్ చెప్పారు.
ఎంపీ తేజస్వీ సూర్య ఇంకా చిన్నపిల్లోడని, అనుభవం లేదని, అతను ఓ వేస్ల్ మెటీరియల్ అంటూ డీసీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో సొరంగ మార్గం నిర్మించరాదనేందుకు తేజస్వీ ఎవరని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు.
కొంతకాలంగా సొరంగ మార్గంతోపాటు పలు అంశాలపై విమర్శలు చేసుకున్న డీసీఎం డీకే శివకుమార్, ఎంపీ తేజస్విసూర్య భేటీ అయ్యారు. డీసీఎం నివాసానికి వచ్చిన ఎంపీ పలు అంశాలపై చర్చలు జరిపారు.
రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్ వారికి ఇష్టం కావని, ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్ వ్యాఖ్యానించారు.