Home » Delhi Capitals
జైపూర్లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం 7 గంటలకు టాస్ వేయగా.. ఢిల్లీ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకూ చెరో మ్యాచ్ ఆడాయి.
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్ ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన సామ్ కర్రాన్(63) పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లివింగ్స్టోన్(38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నెలకొల్పిన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలుపు బాట పట్టింది.
ఐపీఎల్ 2024లో శుక్రవారం నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ పోరాటం మొదలుకానుంది. గతేడాది ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఫుల్ జోష్లో కనిపిస్తోంది.
పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేసినప్పటికీ.. చివర్లో అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ సాధించింది. పంజాబ్ కింగ్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం ఢిల్లీకి మైనసైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్లో మ్యాచ్లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.
దేశరాజధాని ఢిల్లీ నగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాలుగోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను ఇటివల విడుదల చేసిన క్రమంలో వెల్లడించింది.
మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో సారి తుది మెట్టుపై బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన ఢిల్లీ మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్జుకుంది.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్లో ఆడడానికి పంత్కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొన్న రిషభ్ పంత్.. 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్లో ఆడేలా పంత్కు బీసీసీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పంత్ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో కలిసి విశాఖపట్నం స్టేడియంలో సన్నాహకాలు మొదలుపెట్టాడు.