Home » Deepti Sharma
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నవీ ముంబై వేదికగా ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ జెయింట్స్ జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. మ్యాచ్ ఓడినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ నందని శర్మ చరిత్ర సృష్టించింది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్లో 152 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్ను అధిగమించింది. శ్రీలంకతో ఐదో టీ20లో దీప్తి ఈ ఫీట్ అందుకుంది.
టీమిండియా మహిళా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ.. ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటర్లలో సౌతాఫ్రికా కెప్టె్న్ లారా వోల్వార్ట్.. మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించారు. ఆ మరుపురాని క్షణాలు మరోసారి నెమరువేసుకుందాం..
డబ్ల్యూపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను కొనుగోలు చేయడంలో పెద్ద హైడ్రామానే నడిచింది. దీప్తి కోసం ఢిల్లీ, యూపీ పోటీ పడగా.. ఆర్టీఎం కార్డ్ ద్వారా యూపీ రూ.3.20కోట్లకు సొంతం చేసుకుంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పట్ల భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ అభిమానం చాటుకుంది.
యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్నే మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాటరైన శ్వేతా సెహ్రావత్ ను యూపీ రిటైన్ చేసుకుంది. యూపీ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను సైతం సదరు యాజమాన్యం జట్టు నుంచి రిలీజ్ చేసింది.
క్రికెట్లో కొన్ని షాట్లను కొంతమంది మాత్రమే ఆడగలరు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఇటీవల కాలంలో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మల గురించి అందరికీ తెలుసు.. ఈ ముగ్గురిది ఎవరి స్టైల్ వారిదే. కానీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ దీప్తిశర్మ వార్తల్లో నిలిచింది
Deepti Sharma: టీమిండియా మహిళా క్రికెటర్, ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రావంటి దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకుని చరిత్ర సృష్టించింది. టీ20ల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్గా దీప్తి రికార్డు సాధించింది.
IND-W vs ENG-W: ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత అమ్మాయిలు అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా ఉమెన్స్ జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.