Home » Danam Nagender
బీజేపీఎల్పీ నేత మహేశ్వర రెడ్డిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సభ్యత్వం రద్దు చేయమని అడిగే అధికారం ఆయనకు లేదన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను మహేశ్వర రెడ్డి ఈ రోజు కలిశారు. పార్టీ మారిన దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఇదే అంశంపై దానం నాగేందర్ మాట్లాడుతూ.. తన సభ్యత్వం గురించి మాట్లాడే హక్కు మహేశ్వర రెడ్డికి లేదన్నారు.
బీఆర్ఎస్ నుంచి మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రె్సలో చేరనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్లో మీడియాతో ఆయన చిట్చాట్గా మాట్లాడారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) ఆరోపించారు.
ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagendhar) తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి ప్లాన్ చేస్తోందని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్నే బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటుందని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరంలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 14 లోక్ సభ సీట్టు వస్తాయిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) అన్నారు.
జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదని... ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ ... బీజేపీ(BJP) మధ్యనే ఉంటుందని.. విజయం కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) అన్నారు.