Home » Cyberabad Police
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో బైక్ రేసింగ్(Bike Racing) చేస్తున్న వారిపై పోలీసులు కొరడ ఝుళిపించారు. రాత్రిళ్లు రేసింగ్ నిర్వహిస్తూ హల్చల్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. శనివారం రాత్రి టి-హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వ భవనం, మై హోమ్ భుజ ప్రాంతాల్లో రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసులు(Raidurgam police) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
వరుస దొంగతనాలతో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Telangana: ఎన్నికల వేళ నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్వోటీ పోలీసుల పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులకు చిక్కింది. తాజాగా దాదాపు నాలుగు వేల లీటర్ల మద్యాన్ని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
Telangana: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై కమిషనరేట్స్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేశారు.
Telangana: నగరంలో నూతన సంవత్సవరం సందర్భంగా యువత హంగామా అంతాఇంతా కాదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి రోడ్లపై యువత ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే పలువురు మందు పార్టీలు కూడా చేసుకున్నారు. మందు సేవించి రోడ్లపైకి వచ్చిన పలువురు మందుబాబులు పోలీసులకు చిక్కారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో అనేక మంది మందుబాబులు పట్టుబడ్డారు.
Telangana: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సస్పెండ్ అయ్యారు.
ఫెడెక్స్ కొరియర్ ( FedEx courier ) పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ మహిళని ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాష్ట్రంలోని ఆలీఘర్కి చెందిన హర్ష్ కుమార్ మోసగించడంతో పోలీసులు యూపీకి వెళ్లి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మీ చిరునామా, ఆధార్ వివరాలతో ముంబై నుంచి తైవాన్కు అనుమానిత వస్తువులను పంపుతున్నారని తార్నాకాకు చెందిన బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.