Home » Cyber Crime
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారీ స్థాయిలో ఈమెయిల్, పాస్వర్డ్ వివరాలు లీకైన ఉదంతం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఏకంగా 183 మిలియన్లకు పైగా ఈమెయిల్స్, వాటి పాస్వర్డ్స్ లీకైనట్టు తెలిసింది.
ఫేస్బుక్లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్హౌజ్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్బుక్లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి అని, తనది వైజాగ్ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది.
లండన్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్ఫోన్కు జూలై 8వ తేది ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్మేట్నంటూ పరిచయం చేసుకుంది.
కాసులకు కక్కుర్తిపడి, కమీషన్లకు ఆశపడి కొందరు ఏజెంట్లు చిరుద్యోగులు, నిరుద్యోగులు, అప్పులపాలైన వారిని టార్గెట్గా చేసుకుని వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరిస్తున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను వారు లెక్క చేయకపోవడంతో పోలీసు కేసుల్లో చిక్కుకుని బయటకు రాలేక నానాతంటాలు పడుతున్నారు.
బాగ్ అంబర్పేట్కు చెందిన ఓ వృద్ధురాలికి ఈనెల ఆకాష్ చౌదరి పేరిట ఫోన్ కాల్ వచ్చింది. 187 మంది చిన్నపిల్లల అక్రమ రవాణా, హత్య కేసులు వృద్ధురాలిపై ఉన్నాయని సైబర్ నేరగాడు భయపెట్టాడు. తనని అరెస్టు చేసేందుకు బెంగళూరు నుంచి వస్తున్నట్టు వృద్ధురాలిని ప్రలోభ పరిచాడు.
హర్షసాయి ఫౌండేషన్ నుంచి సహాయం ఆశించి మోసపోయానని నల్లచెరువు మండలం గొల్లపల్లికి చెందిన భయ్యప్ప అనే యువకుడు వాపోయాడు. తన నాయనమ్మ అనారోగ్యంతో ఉండడంతో వైద్యం చేయించడానికి హర్షసాయి ఫౌండేషన్ను పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేశాడు యువకుడు.
చదువుకున్న వాళ్లు, వృద్ధులు, మహిళలు, యువకులు ఇలా అన్ని వర్గాల వారిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. 'మీ కొడుక్కి ప్రమాదం జరిగిందంటూ' తాజాగా ఓ మహిళ నుంచి లక్షల్లో డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
అందమైన అమ్మాయితో డేటింగ్ అంటూ నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.6.49 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మలక్పేట్కు చెందిన యువకుడు (32) మహిళలతో స్నేహం, డేటింగ్, లివింగ్ రిలేషన్ పార్టనర్ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్లో లాగిన్ అయ్యాడు.