Home » Cyber Crime
పోస్టల్ శాఖ పేరిట సర్క్యులేట్ అవుతున్న ఓ ఫేక్ ఎస్ఎమ్ఎస్ స్కామ్పై పీఐబీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి మెసేజీలు వస్తే స్పందించొద్దని, మెసేజ్ల్లోని లింకులపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది.
‘మీపై మనీల్యాండరింగ్ కేసులు నమోదు అయ్యాయి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అంటూ బెదిరిగించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వృద్ధుడి నుంచి రూ.21లక్షలు దోచేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు. ముంబై పోలీస్ అధికారుల్లా పరిచయం చేసుకున్నారు.
పీఎం కిసాన్ యోజన పేరుతో ఏపీకే లింక్లు పంపిన సైబర్ నేరగాళ్లు ఫోన్ను తమ నియంత్రణలోకి తీసుకొని బాధితుడి ఖాతా నుంచి రూ2.90 లక్షలు బదిలీ చేసుకున్నారు. బహదూర్పురా ప్రాంతానికి చెందిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో ఏపీకే లింక్ పంపారు.
‘నువ్వు దేశ ద్రోహానికి పాల్పడ్డావు. నీపై అరెస్ట్ వారెంట్ వచ్చింది’ అంటూ భయపెట్టాడు. డబ్బులు కడితే కేసు నుంచి బయటపడొచ్చని నమ్మబలికాడు. రాఘవేంద్రరావు అది నిజమేనని నమ్మాడు.
లాటరీ, ఆఫర్, డిస్కౌంట్ అంటూ ఏపీకే లింక్లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కరెంట్ బిల్లు పెండింగ్, వాటర్ బిల్లు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వల వేస్తున్నారు. చివరికి పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షలు అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు.
విజయవాడకు చెందిన ఓ అబ్బాయికి. ఇన్స్టాగ్రామ్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి వీడియోలకు ఒకరు లైక్లు కొట్టుకున్నారు.. కన్ను కొట్టే ఎమోజీలు వంపుకున్నారు. అమ్మాయి 'ఐ లవ్ యూ'అని మెసేజ్ పెట్టింది.
వృద్ధ దంపతులను 50 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ కేటుగాళ్లు.. వారి నుంచి రూ.30 లక్షలు కొట్టేసిన ఉదంతమిది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.
దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానికి అనుబంధంగా సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో మోసం eSIM స్కామ్. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వివాహ సంబంధిత వెబ్సైట్లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. పంజాగుట్టకు చెందిన యువకుడి (31)కి రెడ్డి మ్యాట్రిమోని సైట్లో ఓ యువతి పరిచయమైంది.