Home » Cyber Crime
సైబర్ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జలమండలి అధికారి పేరిట ఓ సైబర్ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్మండికి చెందిన రిటైర్డ్ ప్రభుతోద్యోగికి వాటర్ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్ చేశాడు.
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.
ఐ బొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్లలో కొన్ని వేల పైరసీ సినిమాలను ఉంచిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానించడంతో రంగంలోకి ఈడీ వస్తోంది.
డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్కు పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్.
డిజిటల్ అరెస్ట్పై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్కు గురయ్యారని పేర్కొన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు.
ఆరు సంవత్సరాల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు రవి. థియేటర్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న నిందితుడు రవి కారణంగా టాలీవుడ్ నిర్మాతలకి వేలాది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.
ఏమి కావాలన్నా చెల్లింపులన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. కావాల్సిన వస్తువు ఇంటికే వచ్చేస్తోంది. అదే సమయంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు
ఓ సైబర్ నేరగాడు ఐపీఎస్ అధికారి సీవీ సజ్జనార్ పేరుతో ఫేస్బుక్లో మోసానికి పాల్పడ్డాడు. సజ్జనార్ స్నేహితుడిని డబ్బు కాజేశాడు. ఈ సంఘటనపై సజ్జనార్ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టు పెట్టారు.
నకిలీ ట్రేడింగ్ యాప్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.21.93 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రచారం చేశారు.