Home » Cyber Crime
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఫొటోను వాట్సాప్లో డీపీగా పెట్టుకొని రూ.2.7కోట్ల మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను, మరో కేసులో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలను అందజేసిన ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
పెన్షన్ కోసం విధిగా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఇస్తామని ఏపీకే లింక్లు పంపిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి రూ.12.99 లక్షలు కొల్లగొట్టారు. బర్కత్పురాలో నివసించే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఈనెల 4న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ అందిస్తామన్న ప్రకటనను ఫేస్బుక్లో చూశారు.
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.
బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ ఓ ఐటీ ఉద్యోగికి రూ. 54.67 లక్షలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రాజు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నెట్ కనెక్షన్ కస్టమర్ కేర్ నంబర్ను గూగుల్లో వెదికిన నగరవాసి సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.1.09 లక్షలు పోగొట్టుకున్నాడు. బహదూర్పురాకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన యాక్ట్ ఫైబర్ సర్వీసుల కోసం ఆన్లైన్లో వెదికాడు.
ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు.
ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.12.56 లక్షలను కాజేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్కు చెందిన 25 ఏళ్ల యువకుడు సెప్టెంబరు ఒకటిన ఇన్స్టాగ్రాంలో ఆన్లైన్ ట్రేడింగ్ యాడ్ను చూశాడు.
తెలంగాణ రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందని డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.
మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలంటూ ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్లు పంపిన సైబర్ నేరగాళ్లు ఇద్దరు నగరవాసుల నుంచి రూ.6.08 లక్షలు కాజేశారు. బేగంబజార్కు చెందిన వ్యక్తి(50)కి వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు సందేశం పంపారు.
ఆర్టీఓ చలాన్, పీఎం కిసాన్ యోజన పేరుతో ఏపీకే లింకులు పంపిన సైబర్ నేరగాళ్లు నాలుగు రోజుల వ్యవధిలో నగరానికి చెందిన ముగ్గురు నుంచి రూ.4.85 లక్షలు కాజేశారు. ముషీరాబాద్కు చెందిన వ్యక్తి (47) సంప్రదించిన నేరగాళ్లు ‘మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయి.