Home » CPI
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్(Pradeep Singh Tagore) అన్నారు. విప్లవ పార్టీలు ఐక్యం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.
బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) ఫాసిజం సిద్ధాంతాలను వ్యతిరేకించేందుకు ఐక్యతగా సీపీఐ(ఎంఎల్) పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు(Potu Ranga Rao) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఇండియా కూటమి పొత్తుధర్మం పాటించి, తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) కోరారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో శుక్రవారం నాడు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు సమావేశమై చర్చిస్తారు. వైసీపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యుహం గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి..? జనాలను ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగేందుకు ఆస్కారం ఉంది.
సీఎం జగన్ (CM Jagan) చాలా ధైర్యవంతుడని.. కానీ ఆ ధైర్యాన్ని చెడు పనులు చేయడంలో చూపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) వ్యాఖ్యానించారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం కేసీఆర్పై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదముందని ఒకవైపు దేవుళ్ళను పూజిస్తూ.. మరోవైపు రైతులను హింసిస్తోందని ఆరోపించారు.
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున హైదరాబాద్ రాజధాని డ్రామాకు వైసీపీ తెరలేపిందన్నారు.
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వరం మారిందని.. ఓటమి గ్రహించారని.. అందుకే వైసీపీ అభ్యర్థులను సీఎం మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును అప్పనంగా ఇతరులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. యాత్ర-2 సినిమా తీసిన దర్శకుడు మహి వి రాఘవకు భూమి కేటాయించడాన్ని తప్పు పట్టారు.