Home » CPI Narayana
గుంటూరు జిల్లా: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని, మోదీ డబుల్ ఇంజన్ అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కామెంట్స్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని సీపీఐ ముఖ్యనేత నారాయణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడంతో వెనక ఉద్దేశం అదేనని వివరించారు. రూ.వంద కోట్ల స్కామ్ ఆరోపణలు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. రూ.2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలు ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని అరెస్టు చేస్తే ప్రధాని మోదీకి పుట్టగతులుండవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే మంచిదని, అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు జైళ్లో ఉన్నట్లు అవుతుందని సీపీఐ అగ్రనేత నారాయణ వ్యాఖ్యానించారు. ‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా జైళ్లో పెడితే మనకు మంచి అవుతుంది’’ అని అన్నారు.
సీఎం రేవంత్రెడ్డిని (CM Revanth Reddy) అరెస్టు చేస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలను కూడా అరెస్టు చేయాలని సీపీఐ (CPI) తెలంగాణ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) డిమాండ్ చేశారు. ఎన్నికల వేళల్లో ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం మోదీకి ఆనవాయితీగా మారిందన్నారు.
Telangana: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రమాదవశాత్తు జారి పడటంతో గాయపడ్డారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ సీపీఐ నేత జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ... ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే ఎలక్టోరల్ బాండ్లను మోదీ సర్కార్ (Modi Govt) తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. SBI బ్యాంకు అధికారుల వెనుక కేంద్రపెద్దలున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో కేంద్రానికి లొంగిపోయాడని, కేంద్రం ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంత్రి వేడుకలను బీజేపీ, సీపీఐ నేతలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల సందర్భంగా కమలం నేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ (CM Jagan) చాలా ధైర్యవంతుడని.. కానీ ఆ ధైర్యాన్ని చెడు పనులు చేయడంలో చూపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) వ్యాఖ్యానించారు.