Home » Congress Govt
నిజామాబాద్ బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు.
సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి పేదల బతుకులు, ఇళ్లు కూల్చడానికి హైడ్రా తెచ్చారని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలని ఎన్డీఎస్ఏ అధికారులు గుర్తించారని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.
మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పున: నిర్మాణ పనుల్లో ఎక్కడ అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గద్దెల పున: నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని.. ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి తప్పుచేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ తమకంటే ఎక్కువగా బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడిన ఆయన ఆ పార్టీతో చేతులు కలపడం బాధాకరమని పేర్కొన్నారు.
పంట కొనుగోలు చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు.
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్.. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం... మహాత్మా జ్యోతి రావు పూలే అని వ్యాఖ్యానించారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కేసీఆర్ హయాంలోని పదేళ్లు వనరులు దోపిడీకి గురికావటం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.