Home » CM Stalin
రాష్ట్రంలో గత నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్న ప్రజావ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని మరో 9 నెలల్లో ప్రజలే ఇంటికి సాగనంపుతారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈ నెల 7వ తేదీన ప్రారంభించిన తొలి ప్రచారయాత్ర బుధవారం తంజావూరు జిల్లా వరత్తనాడులో ముగిసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యేళ్లతరబడి భాష, విద్య, నిధుల విషయంలో అనుసరిస్తున్న నిర్ల్యక్ష వైఖరిని ఖండిస్తూ ఉభయ సభల్లో గళమెత్తాలని డీఎంకే ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తేనాంపేటలోని అన్నా అరివాలయంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజర్పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడి అనవసరమైన వివాదాలను సృష్టించవద్దంటూ పార్టీ శ్రేణులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్టాలిన్ తన ఎక్స్పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకే కేంద్రంలోని బీజేపీ పాలకులు తమిళగవెట్రి కళగంకు మద్దతునిస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు విజయ్ తల్లి క్రైస్తవురాలు కావడంతో, ఆ ఓట్లను చీల్చవచ్చునని కలలు కంటున్నారని స్పీకర్ అప్పావు విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘ఉంగలుడన్ స్టాలిన్’ పేరుతో ప్రారంభమైన ప్రజావిజ్ఞప్తుల శిబిరాలకు వస్తున్న జనాలను చూసి ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామికి వణకుపుట్టి, విమర్శల పేరుతో డీఎంకే ద్రావిడ తరహా పాలనకు విస్తృత ప్రచారం చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎద్దేవా చేశారు.
మతవాద బీజేపీ గొంతుకగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వ పాలన చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మెచ్చుకుంటున్నారని, గతంలో లేని విధంగా మూడువేలకు పైగా సుప్రసిద్ధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలను జరిపించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
డీఎంకే పాలనపై తాను ఎలాంటి విమర్శలు చేయలేదని, భవిష్యత్తులోనూ ఆరోపణలు, విమర్శలు చేయబోనని ఎండీఎంకే నేత వైగో స్పష్టం చేశారు.
అవసరాలకనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5 లక్షలు మ్యారేజ్ అలవెన్స్ అందించనున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత బడ్జెట్ సమావేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్ధం పలు ప్రకటనలు చేశారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.