Home » CM Siddaramaiah
రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచితాలు సమంజసం కాదని, శక్తి గ్యారెంటీతో బస్సుల్లో పురుషులకు సీట్లు ఉండడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్పాండే వ్యాఖ్యలు సర్వత్రా సంచలనానికి దారితీశాయి.
రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య ఫోన్ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ తెలిపారు.
అభివృద్ధి విషయంలో కేంద్రం మాకు ద్రోహం చేసిందనే విషయంలో నేను అబద్ధాలు చెప్పినట్టు నిరూపిస్తే ఇకపై వేదికలపై ప్రసంగాలు చేసేది లేదని సీఎం సిద్దరామయ్య సవాల్ విసిరారు. దావణగెరె జిల్లాలో సోమవారం రూ.1350 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట, ఆర్సీబీకి సన్మాన కార్యక్రమాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్నటిదాకా చెబుతూ వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మాటమార్చారు.
ఆ ఇద్దరి మధ్య వివాదం బాగానే ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా వారి మధ్య ఉన్న విభేదాలు ఓ విషయంతో మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. అయితే.. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.
కన్నడ చరిత్ర గురించి ఆయనకేం తెలుసట.. అంటూ తమిళ నటుడు కమల్హాసన్పై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళభాష నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
ఆ రెండు పథకాలను వారికి రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజరాయరెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల్లో కొందరు అనర్హులున్నట్లు గుర్తించామన్నారు.
కోవిడ్పై ఆందోళన వద్దే వద్దని, ఎవరూ భయపడాల్సిన అవపరం కూడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అయితే.. జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ముందు జాగ్రత్తగా మాస్క్లు ధరించాలని ఆయన కోరారు.
గాలి జనార్దన్రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..