Home » CM Siddaramaiah
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య బాధ్యతలు చేపట్టింది మొదలు..
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్చల్ చేస్తోంది.
కాంగ్రెస్లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.
ఇదే ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కానీ మరో మూడేళ్లు సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారంటే ఇది గ్యారెంటీగా ప్రతిపక్షనేత అశోక్(Ashok) ఎద్దేవా చేశారు.
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు.
రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచితాలు సమంజసం కాదని, శక్తి గ్యారెంటీతో బస్సుల్లో పురుషులకు సీట్లు ఉండడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్పాండే వ్యాఖ్యలు సర్వత్రా సంచలనానికి దారితీశాయి.
రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య ఫోన్ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ తెలిపారు.
అభివృద్ధి విషయంలో కేంద్రం మాకు ద్రోహం చేసిందనే విషయంలో నేను అబద్ధాలు చెప్పినట్టు నిరూపిస్తే ఇకపై వేదికలపై ప్రసంగాలు చేసేది లేదని సీఎం సిద్దరామయ్య సవాల్ విసిరారు. దావణగెరె జిల్లాలో సోమవారం రూ.1350 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట, ఆర్సీబీకి సన్మాన కార్యక్రమాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్నటిదాకా చెబుతూ వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మాటమార్చారు.