Home » CM Jagan
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. ఆ అంశంపై వర్మ స్పందిస్తూ.. ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు.
ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal) తెలిపారు. ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ (YSRCP) ఎంపీ ఆర్ క్రిష్టయ్య కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్ఆపరేటివ్ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
పథకాల కొనసాగింపుపై జగన్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. నరసాపురం సభలో జగన్ మాట్లాడుతూ.. పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేయాలని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని తెలిపారు. పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని.. గతంలో ఎన్నడూ జరగని.. చూడని విధంగా ఇంటికే మూడు వేల చొప్పున పెన్షన్లు ఇచ్చామన్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్కు సూచిస్తున్నానన్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.
వందలాది మంది ఉద్యోగుల మెడపై జగన ప్రభుత్వం, సమగ్రశిక్ష అధికారులు కత్తి పెట్టారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఒక రోజు బ్రేక్ ఇచ్చి.. ఆ ఏడాది కాలానికి ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది 40 రోజులకు మాత్రమే రెన్యువల్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి...? కొనసాగిస్తారా..? ఉద్వాసన పలుకుతారా..? తేలాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన ప్రభుత్వ నిర్ణయంపై కేజీబీవీ ఉద్యోగులు మండిపడుతున్నారు....
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు.వేపగుంటా మీనాక్షి కన్వేషన్స్లో కూటమి ఆద్వర్యంలో ఎలైట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు..కూటమి పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.