• Home » CM Jagan

CM Jagan

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు  సీబీఐ షాక్..

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.

AP Elections: తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేదు.. ఏపీకి ఇంకేం చేస్తావ్ జగన్?

AP Elections: తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేదు.. ఏపీకి ఇంకేం చేస్తావ్ జగన్?

Andhrapradesh: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు.

CPM Raghavulu: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే

CPM Raghavulu: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సీపీఎం రాఘవులు ఫైర్ అయ్యారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే.. ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తానంటూ జగన్ వ్యాఖ్యలు కార్మికులను, ప్రజల్ని ఎగతాళి చేయడమేనన్నారు.

CM Jagan: నేడు కర్నూలుకు సీఎం జగన్ రాక..

CM Jagan: నేడు కర్నూలుకు సీఎం జగన్ రాక..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. పార్టీలన్నీ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. అధికారం కోల్పోకూకడదని వైసీపీ.. అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. నేడు కర్నూలు నగరానికి సీఎం జగన్ రానున్నారు. ఎస్‌బీఐ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

AP ELECTIONG : మాట ఇచ్చారు.. మడమ తిప్పారు..!

AP ELECTIONG : మాట ఇచ్చారు.. మడమ తిప్పారు..!

కరువు నేలకు సాగునీరు జీవం పోస్తుంది. వ్యవసాయమే జీవనాధారమైనచోట రైతులు మొదట ఆశించేది నీటినే. కాలువ నీటితో పొలాలను పచ్చగా మార్చేందుకు చెమటోడుస్తారు. నీరే లేకుంటే కుదేలైపోతారు. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి.. అలసిపోవడం ఇక్కడి ప్రజలకు అలవాటైంది. ‘మా బతుకులు ఇంతేనా..?’ అని ఆవేదన పడే సమయంలో.. ‘మారుస్తాం.. నీరిస్తాం..’ అని ఎవరు చెప్పినా విశ్వసిస్తారు. ఆశపడి.. ఆదరిస్తారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన ఇలాంటి హామీనే ...

ABN Big Debate With CBN: నన్ను చంపేస్తామని బెదిరించారు..  బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు

ABN Big Debate With CBN: నన్ను చంపేస్తామని బెదిరించారు.. బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.

ABN Big Debate With CBN: జగన్ నైజం ఇదే..  కాళ్లు పట్టుకుంటాడు: చంద్రబాబు

ABN Big Debate With CBN: జగన్ నైజం ఇదే.. కాళ్లు పట్టుకుంటాడు: చంద్రబాబు

సీఎం జగన్‌ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.

AP Election 2024:  అందుకే బీజేపీ జగన్‌ను వదిలేసింది: గోనె ప్రకాష్ రావు

AP Election 2024: అందుకే బీజేపీ జగన్‌ను వదిలేసింది: గోనె ప్రకాష్ రావు

ఏపీలో తెలుగుదేశం పార్టీ - జనసేన- బీజేపీ కూటమి 145 సీట్లు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) జోస్యం చెప్పారు. జగన్ వై నాట్ 175 అన్నాడు..అలాంటప్పుడు ఇతరులను వేరే చోటు నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టారని ప్రశ్నించారు. పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగిందని అన్నారు.

 AP Election 2024: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. ప్రధాని మోదీ మాస్ వార్నింగ్

AP Election 2024: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. ప్రధాని మోదీ మాస్ వార్నింగ్

ఏపీలో ఈ ఎన్నికల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి, ఏపీ వికాసమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. పేదలు ఎవ్వరూ అభివృద్ధి కాలేదని, మాఫియా నేతలు మాత్రం అభివృద్ధి అయ్యారని విమర్శించారు.

AP Elections: జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు: గద్దె రామ్మోహన్

AP Elections: జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు: గద్దె రామ్మోహన్

Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి