Home » Chief Minister
'వికసిత్ ఢిల్లీ బడ్జెట్' రూపకల్పన కోసం నిపుణులతో సహా వివిధ వర్గాలను తమ ప్రభుత్వం సంప్రదించిందని, ప్రజల నుంచి ఇ-మెయిల్ ద్వారా 3,300 సూచనలు, వాట్సాప్ ద్వారా 6,982 సూచనలు వచ్చాయని సీఎం రేఖాగుప్తా తెలిపారు.
హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని, వారు డబ్బులు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
కొత్త వేతనాల ప్రకారం ముఖ్యమంత్రి వేతనం రూ.75,000 నుంచి 1.5 లక్షలకు చేరింది. మంత్రుల వేతనం 108 శాతం పెరిగి రూ.60,000 నుంచి రూ.1.25 లక్షలకు చేరింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది.
జనాభా ప్రాతిపదికన పునర్విభజనను తమిళనాడు ప్రభుత్వం తొలుత వ్యతిరేకించిందని, రాష్ట్రంలోని 58 పార్టీలు అన్ని విభేదాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయని ఎంకే స్టాలిన్ చెప్పారు.
రెహ్మాన్ ఆదివారం ఉదయం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియాగ్రామ్ చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది.
మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్ఈపీ అనేది జాతీయ విద్యావిధానం కాదని, దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన 'కాషాయ పార్టీ విధానం' అని చెన్నైలో బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ 'అహంకార చక్రవర్తి' అని, తమిళనాడు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదని, ఆయన ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవాలని ఎంకే స్టాలిన్ సూచించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారతా శాఖ తరఫున పింక్ ఆటోలను లబ్ధిదారులకు అందించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద్భంగా శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు.
మహాయుతి ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు సమన్వయంతో పనిచేస్తుంటాయని, విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూటమి నేతలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఫడ్నవిస్ తెలిపారు. ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.