Home » Chief Minister
కేరళంలో కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఈ రేసులో లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ముందున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించినట్టు పార్టీ వర్గాలు శుక్రవారంనాడు తెలిపాయి.
కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఢిల్లీలోని బీజేపీకి మరబొమ్మలా మారిందని అన్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తూత్కుకుడిలోని తిరుచెందూరు ఆలయాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి శుక్రవారంనాడు సందర్శించారు. బీజేపీతోనే ఎన్ఆర్ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని, నామినేషన్ తేదీ కంటే ముందే సీట్ల పంపకాలు ఖరారు అవుతాయని ఈ సందర్భంగా చెప్పారు.
కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మణిపూర్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను నియమించింది.
విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్ను బీజేపీ కలవాలని అనుకుంటున్నట్టు వస్తున్న సమాచారంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ బిల్లును గవర్నర్ తోసిపుచ్చలేదని చెప్పారు.
డిసెంబర్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ కౌన్సిల్స్లో ఏ పార్టీకి మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి తలెత్తింది. దీంతో అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.